వరుసగా మూదోరోజూ బంగారం ధరలు పైకెగాశాయి. అయితే, రెండురోజులుగా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసన బంగారం వెండి ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ వారంలో ఒక్క రోజు కిందకు దిగివచ్చిన బంగారం ధరలు మిగిలిన రోజుల్లో పెరుగుతూనే వచ్చాయి. అదే బాటలో ఈరోజు (26.01.2020) కూడా బంగారం ధరలు పైచూపు చూశాయి.
భారీగా పెరిగిన బంగారం..
మార్కెట్లో ఆదివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 430 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,660 నుంచి 42,090 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 430 రూపాయలు పెరగడంతో 38,190 నుంచి 38,620 రూపాయల వద్దకు చేరుకుంది.
వెండి ధరలూ అదే దారిలో..
ఒకవైపు బంగారం ధరలు భారీగా పెరిగితే అదే దారిలో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వెండి ధరలు కేజీకి 140 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. . దీంతో కేజీ వెండిధర 49,060 రూపాయల నుంచి 49,200 రూపాయలకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,090 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,620 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర భారీగా పెరిగి 49,200 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలోనూ..
కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 450 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,650 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,450 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,200 రూపాయలుగా ఉంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.