భగ్గుమన్న బంగారం.. అమాంతం పెరిగిన వెండి ధరలు!
దేశీయంగా ఈరోజు (05-12-2019) ఒక్కసారిగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి.
రెండు రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ఈరోజు షాకిచ్చాయి. . మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. 05.12.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం ధరలతో పోలిస్తే 420 రూపాయలవరకూ పెరిగింది. వెండి ధరలు కేజీకి 600 రూపాయల వరకూ పెరిగాయి.
గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయలు పెరిగి 39,940 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 420రూపాయలు పెరిగి 36,650 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు భారీగా భగ్గుమన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర ఏకంగా 600 రూపాయలు పెరిగి 47,500 వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,940 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,650 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 400 రూపాయలు పెరిగింది. దీంతో 38,600 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయలు పెరగడంతో 37,400 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 600 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 46,900 రూపాయలకు చేరింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05.12.2019 గురువారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ, ఇటూ మారే అవకాశాలు ఉంటాయి.