స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు!

Update: 2020-01-02 05:33 GMT

నిన్న ఒక్క రోజు నిలకడగా ఉన్న బంగారం  తీసిన బంగారం ధరలు ఈరోజు పైకి కదిలాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం నాటి ధరతో పోలిస్తే 80 రూపాయలు పెరిగి, 40,750 రూపాయలైంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 80 రూపాయలు పెరిగింది. దీంతో 37,350 రూపాయల వద్దకు చేరింది. కాగా, వెండి ధర ఈరోజు మార్పు లేకుండా స్థిరంగా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,350 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,750 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,350 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,150 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 38,150 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 49,350 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News