Surya Rahu Yuti 2026: 18 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం.. ఈ మూడు రాశుల వారికి గండం!
Surya Rahu Yuti 2026: హిందూ సంప్రదాయంలో గ్రహణాలను అత్యంత కీలకమైన మార్పులుగా పరిగణిస్తారు.
Surya Rahu Yuti 2026: హిందూ సంప్రదాయంలో గ్రహణాలను అత్యంత కీలకమైన మార్పులుగా పరిగణిస్తారు. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి 13వ తేదీన ఏర్పడబోయే సూర్యగ్రహణం జ్యోతిష్య రీత్యా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత సూర్యుడు, రాహువు కుంభరాశిలో కలవడం వల్ల ఈ అరుదైన గ్రహణం ఏర్పడుతోంది. అయితే, ఈ 'సూర్య-రాహు యుతి' వల్ల ఏర్పడే అశుభ యోగం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
ఈ 3 రాశుల వారు జాగ్రత్త!
సూర్య, రాహువుల కలయిక వల్ల ఏర్పడే ఈ గ్రహణం కారణంగా కింది రాశుల వారు ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి:
1. మీన రాశి (Pisces): ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల ఆకస్మిక ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో అజాగ్రత్త వద్దు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదు.
2. కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడి అధికమవుతుంది. పాత అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉన్నందున ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలి.
3. కన్య రాశి (Virgo): వీరికి శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకోని నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉన్నందున పెట్టుబడుల విషయంలో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. hmtv News దీన్ని ధృవీకరించలేదు.