అమరావతిలో శ్రీవారి ఆలయానికి రూ.36 కోట్లు

Update: 2019-09-23 11:42 GMT

టీటీడీ కొత్త పాలక మండలి సమావేశం ముగిసింది. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వాటికి బోర్డు ఆమోదం తెలిపింది. 42 అంశాలపై చర్చించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయం 150 కోట్ల రూపాయల నుంచి 36 కోట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

తిరుమలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడమే తమ తక్షణ కర్తవ్యమని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 150 కోట్ల నుంచి 36 కోట్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై చర్చించారు.

Full View

Tags:    

Similar News