టీడీపీ నాయకులు పోలింగ్ బూత్ల వద్ద ప్రచారాలు చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. పోలింగ్ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే రీపోలింగ్ అంటున్న చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు భయం పట్టుకుందని అన్నారు. నిన్న ఈసీతో చంద్రబాబు మాట్లాడిన విధానం, వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతల దాడులు చూస్తుంటే వారికి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్ధమవుతుందని వాసిరెడ్డి ప్రధమ ఆరోపించారు.