కొద్ది రోజులుగా ఏపీలో స్తబ్దుగా ఉన్న ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి జోరందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్ది టీడీపీ, జనసేన నేతలు ఒక్కొక్కరుగా అధికార వైసీపీలో చేరుతున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కదిరిబాబు, సతీష్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే రెహమాన్ తో పాటు పలువురు టీడీపీ సీనియర్లు వైసీపీలో చేరారు. త్వరలో మరింత మంది విపక్ష నాయకులు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. టీడీపీతో పాటు జనసేనలో క్రియాశీలకంగా వున్న నేతలపై దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో ప్రజాకర్షణ కలిగిన బాలరాజు లాంటి నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ, జనసేన కు ఉన్న ఓటు బ్యాంకును తమపార్టీ వైపుకు జగన్ తిప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.