వైయస్ జగన్ పర్యటన ఖరారు..

Update: 2019-01-25 13:44 GMT

సుదీర్ఘ పాదయాత్ర అనంతరం వైసీపీ అధినేత వైయస్ జగన్ మరో కార్యక్రమానికి సిద్ధమయ్యారు. వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమరశంఖారావం సమావేశాలు ఉంటాయని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 'ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో పార్టీ సమావేశాలు ఉంటాయి. 4న తిరుపతి, 5న కడప, 6న అనంతపురంలో పార్టీ సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా సమర శంఖారావానికి వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఇదిలావుంటే పాదయాత్ర అనంతరం బస్సుయాత్ర ఉంటుందని వైసీపీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News