YS Sharmila: సజ్జల వ్యాఖ్యలు అర్థరహితం

* తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సమంజసమా?

Update: 2022-12-09 03:29 GMT

YS Sharmila: సజ్జల వ్యాఖ్యలు అర్థరహితం 

YS Sharmila: రాష్ట్ర విభజన అంశాలపై సజ్జల రామకృష్ణారెడ్డి అర్థరహిత ప్రస్తావన చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తెలంగాణ ఒక వాస్తవం, ఎంతో మంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాలమీద తెలంగాణ ఏర్పడిందన్నారు. విడిపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలపడం అసాధ్యమని ఆమె ట్వీట్ చేశారు. ఏపీ నాయకులు అభివృద్ధిపై ఫోకస్ పెట్టకుండా, సాధ్యంకానికి విషయాలను ప్రస్తావించి ప్రజల్లో కన్ఫూజన్ క్రియేట్ చేయడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సమంజసంకాదని షర్మిల తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News