YS Sharmila: బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు.. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది

YS Sharmila: ఆంధ్ర రాష్ట్ర మేలు కోసం ఇదే ఇచ్ఛాపురం నుంచి నా ప్రస్థానం మొదలు

Update: 2024-01-23 08:41 GMT

YS Sharmila: బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు.. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది

YS Sharmila: జగన్ సర్కార్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం బీజేపీకి కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, కానీ ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేస్తుందన్నారు. జగన్ అన్న ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజు కూడా అడగలేదని షర్మిల ధ్వజమెత్తారు. 25మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తానన్న మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు షర్మిల. ఆంధ్ర రాష్ట్ర మేలు కోసమే ఇచ్ఛాపురం నుంచి తన ప్రస్థానం మొదలు అయిందని షర్మిల పేర్కొన్నారు.

Tags:    

Similar News