Ahobilam: భక్తులకు గమనిక.. అహోబిలం ఆలయంలో రేపు దర్శనాలు నిలిపివేత.. కారణం ఇదే!

Ahobilam: ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం (ఫిబ్రవరి 17) భక్తులకు స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి (CAO) రామానుజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2026-02-16 07:54 GMT

Ahobilam: ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం (ఫిబ్రవరి 17) భక్తులకు స్వామివారి దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి (CAO) రామానుజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిబ్రవరి 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమయం ముగిసిన అనంతరం యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు.

అహోబిలంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమమైన 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా మంగళవారం ఆలయ గర్భాలయం, ఉప ఆలయాలను సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శుద్ధి చేయనున్నారు.

ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతున్న సమయంలో గర్భాలయ ప్రవేశం మరియు దర్శనాలు ఉండవని, కావున సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని సీఏవో కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన వివరించారు.

Tags:    

Similar News