నేడు జగన్ కీలక భేటీ

Update: 2019-02-04 02:43 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని.. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాకి ఫిర్యాదు చేయనున్నారు.

సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇక ఆయనతోపాటు ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు సీనియర్ నేత బొత్స. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బాలసౌరి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.    

Similar News