ఇది హర్షించదగ్గ విషయం : వైయస్ జగన్

Update: 2019-04-11 15:01 GMT

ఫలితాలకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమిని అంగీకరించారని అన్నారు వైసీపీ అధినేత వైయస్ జగన్.. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు స్థాయి మరిచి ప్రవర్తించారని.. ఆయన చేసిన కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు అన్నింటిని దాటుకుని ఓటు వేశారని.. ఈ సందర్బంగా ప్రజలకు వైఎస్‌ జగన్ కృతజ్ఞతలు అని తెలిపారు.

ఎన్నికలు జరగకుండా, ఓటింగ్‌ శాతం తగ్గించడానికి చంద్రబాబు అనేక డ్రామాలు ఆడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇది ప్రజల విజయమని అన్నారు. పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు చనిపోయారని, వారికి పార్టీ అన్నవిధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు రిగ్గింగుకు ప్రయత్నించారని ఆరోపించారు.   

Similar News