AP News: నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ సమావేశం

AP News: కొత్త జిల్లాల ఏర్పాటు, కేబినెట్ విస్తరణపై చర్చించనున్న జగన్...

Update: 2022-04-01 04:39 GMT

AP News: నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ సమావేశం

AP News: ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఈనేపథ్యంలోనే నేడు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా గవర్నర్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 13 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

Tags:    

Similar News