రేపటి కలెక్టర్ల సదస్సులో స్వల్ప మార్పులు

Update: 2019-06-23 16:03 GMT

రేపు నిర్వహించనున్న కలెక్టర్ల సదస్సులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా రేపు ఒక్కరోజే సదస్సు నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా సదస్సును రెండు రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టర్లతో సదస్సు నిర్వహిస్తారు. ఎల్లుండి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఎల్లుండి ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాడ్డక జరుగుతున్న తొలి కలెక్టర్ల సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీని అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్పష్టమైన కార్యచరణతో ముందుకుసాగుతున్న సీఎం ఈ సమావేశంలో తన భవిష్యత్‌ ప్రణాళికలను కలెక్టర్లకు వివరించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News