జగన్ ప్రభుత్వంలోకి పీకే టీమ్ సభ్యుడు.. కీలక బాధ్యతలు అప్పగింత..

Update: 2019-10-30 03:33 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నూతనంగా మరో ఇద్దరు చీఫ్ డిజిటల్ డైరెక్టర్లను నియమించింది. సీవీ రెడ్డి, బ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తులను ఏపీ ప్రభుత్వంలో చీఫ్ డిజిటల్ డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. వీరిద్దరూ రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖకు అనుబంధంగా సోషల్ మీడియా విభాగంలో వారు విధులు నిర్వహించనున్నారు. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గా కడప జిల్లాకు చెందిన గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే వ్యక్తిని నియమించింది.

తాజాగా మరో ఇద్దరిని ఈ పదవిలో నియమించింది. కాగాబ్రహ్మానంద పాత్ర అనే వ్యక్తి ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ లో కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైసీపీ.. సోషల్ మీడియానుసమర్ధవంగా నిర్వహించడంలో అతను పాత్ర ఉంది. జగన్ టూర్లపై పాటలు విడుదల చేయడం, ప్రత్యర్థి పార్టీలను కౌంటర్ చేయడం, వారి వ్యాఖ్యలకు దీటుగా బదులివ్వడం లాంటి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా అతనే చూసేవారు.

Tags:    

Similar News