జగన్‌ అమెరికా పర్యటన క్లోజ్..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి జగన్ మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు.

Update: 2019-08-23 06:18 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. అమెరికా నుంచి జగన్ మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈనెల 15వ తేదీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతపనులపై అమెరికా వెళ్లినప్పటికీ జగన్ అక్కడ పెట్టుబడుల సమీకరణ కోసం చాలా సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7గంటలకు జగన్ చికాగో నుండి హైదరాబాద్ బయలుదేరారు. రేపు ఉదయం హైదరాబాద్‌కి చేరుకుంటారు. మొత్తానికి వారం రోజుల పాటు జరిగిన జగన్ అమెరికా పర్యటన ముగిసింది.  

Tags:    

Similar News