Parliament 2021: పెట్రోధరలపై లోక్‌సభలో ప్రశ్నించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

పెట్రో ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలన్నారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్.

Update: 2021-03-15 10:20 GMT

ఫైల్ ఇమేజ్ 

Parliament 2021: పెట్రో ధరలు తగ్గాలంటే రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలన్నారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. పెరిగిన ధరల తగ్గింపుపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రశ్నించగా అందుకు అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. పెట్రో ధరలపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు విధిస్తున్నాయని రెండు ప్రభుత్వాలు కలిసి తగ్గిస్తేనే ధరలు తగ్గుతాయని స్పష్టం చేశారు. పెట్రో ధరల్ని జీఎస్టీలోకి తీసుకువచ్చే అంశంపై కౌన్సిల్ మీటింగ్‌లో రాష్ట్రాలు చర్చించాలన్నారు. 

Tags:    

Similar News