జనసేన సభ్యుడు వర ప్రసాద్ ప్రసంగం టీడీపీ వైసీపీల మధ్యల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. రాపాక వైసీపీ మిత్రపక్షంగా మాట్లాడుతున్నారంటూ టీడీపీ సభ్యులు రన్నింగ్ కామెంట్ చేశారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి జనసేన, ప్రజా శాంతి పార్టీలు ఎవరి మిత్రపక్షమో తెలియదా అంటూ వ్యంగంగా ప్రశ్నించారు. శ్రీకాంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తాము బీజేపీతో కలిసి పోటీ చేయలేదని పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ ఏదిపడితే అది మాట్లాడితే కుదరదని శ్రీకాంత్రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంతో పొట్లాడే పరిస్థితి లేదని, సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తున్నామని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు.