పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు ప్యాకేజీలలోనే నడుస్తున్నాడని విమర్శించారు ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న రోజా పవన్ నివేదికపై మండిపడ్డారు. ఏపీలో వైసీపీ వంద రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ మాటలు అర్ధరహితమన్నారు. గతంలో ఇసుక విధానంపై గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల పెనాల్టీ వేసినా పట్టించుకోని వ్యక్తి తమ ప్రభుత్వ విధానంపై మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు రోజా.