ఇటు వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్ర.. అటు కారు బోల్తా..

Update: 2019-11-20 02:30 GMT

పాణ్యం వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన కారు బోల్తా పడింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీశైలం సమీపంలోని నంది ఘాటు మలుపు వద్ద జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామికి మొక్కుకున్నారు. అందులో భాగంగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాటసాని అనుచరులు కారులో శ్రీశైలానికి బయల్దేరారు. నంది ఘాట్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలవడంతో వారిని వెంటనే కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. 

Tags:    

Similar News