టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంది-అమర్నాథ్

*సర్పంచ్ అభ్యర్ధిని బెదిరించిన ఘటనలో అచ్చెన్నాయడిని అరెస్ట్ చేశారు *ఎన్నికలు ప్రశాంతంగా జరగలాని చూస్తున్నాం-అమర్నాథ్

Update: 2021-02-02 15:00 GMT

టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతుంది-అమర్నాథ్

ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేశారంటూ టీడీపీ నేతలు నిందలు మోపడం సరి కాదని విశాఖ ఎమ్మెల్యే అమర్నాథ్ అన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని చూస్తూంటే..వైసీపీ బలపరిచిన అభ్యర్ధులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్పంచ్ అభ్యర్ధిని బెదిరించినందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులను కించపరిచే విధంగా టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై సుమోటోగా విచారణ జరిపి, కేసు నమోదు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.  

Tags:    

Similar News