వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్ధత

Update: 2019-07-31 09:53 GMT

వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఎంపీఈవోల దీక్ష విరమణ సమయంలో ఆయన వాంతులు చేసుకొని సొమ్మసిల్లారు. వెంటనే ఆయన్ను దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు ఉమ్మారెడ్డికి వైద్యం అందిస్తున్నారు. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద రీలే నిరాహార దీక్షలు చేస్తోన్న ఎంపీఇవోలతో చర్చించేందుకు బుధవారం ఉదయం ఆయన అక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడుతూ సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Full View  

Tags:    

Similar News