విపక్షాల ఆరోపణలకు బ్రేక్ వేసేందుకు సిద్ధం అవుతున్న వైసీపీ

Update: 2019-08-24 15:58 GMT

ఏపీ ప్రభుత్వం పై విపక్షాల ఆరోపణలకు బ్రేక్ వేసేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి అన్ని... వాటిని తిప్పికొట్టేందుకు వైసీపీ ట్రబుల్ షూటర్స్ ను యాక్టివేట్ చేస్తోంది.. వైసీపీ అధికారంలోకి వచ్చి 2నెలలు గడుస్తోంది.. సీఎం జగన్ తన మార్క్ పాలనతో ప్రజల మన్ననలు అందుకుటున్నారు.. ఎవరూ ఊహించని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్.. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. రాజధాని, పోలవరం వరదలతో పాటు రాష్ట్రంలో పలు కీలక అంశాలపై.. ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి..

విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతి అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నాయి.. అవకాశం దొరికితే ప్రభుత్వంపై విమర్శలతో పాటు.. తప్పులను ఎత్తి చూపిస్తూ సక్సెస్ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు.. ఈ క్రమంలో విపక్షాల ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో అధికార పార్టీ ట్రబుల్ షూటర్లను రంగంలోకి దింపి విపక్షాలకు చెక్ పెట్టాలని చూస్తోంది... తమ గళాన్ని బలంగా వినిపించే నాయకులను మళ్లీ రంగంలోకి దించి.. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని చూస్తోంది ప్రభుత్వం.. మొత్తానికి టీడీపీ, బీజేపీలను ఎదురించడంలో ఈ ట్రబుల్ షూటర్లు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.  

Tags:    

Similar News