ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేయడమే తమ లక్ష్యమని కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. సీఎం జగన్ ఇచ్చిన వాగ్దానాలను నమ్మే వైసీపీకి ఘనవిజయం కట్టబెట్టారని బొత్స అన్నారు. నవరత్నాల అమలుతోపాటు కర్నూలు జిల్లాలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండేలా తన వంతు కృషిచేస్తానన్నారు.