Y S Bharathi: పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

Y S Bharathi: వేంపల్లిలో వైఎస్ భారతికి గ్రామస్తుల స్వాగతం

Update: 2024-04-30 07:24 GMT

Y S Bharathi: పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

Y S Bharathi: సీఎం జగన్ విజయం కాంక్షిస్తూ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ భారతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడవ రోజు వేంపల్లిలో ఆమె ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న సీఎం జగన్ సతీమణికి సతీష్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ భారతి ప్రచారానికి వెళ్తుంటారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా...లేదా అని ఆరా తీశారు. పులివెందుల ప్రజానీకంతో వైఎస్‌ భారతి మమేకమవుతున్న తీరు ఓటర్లను ఆకట్టుకుంటోంది. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ భారతి ఓటర్లను కోరారు.

Tags:    

Similar News