Vizianagaram: ఘనంగా ప్రారంభమైన పైడితల్లి సిరిమానోత్సవం

Vizianagaram Pydithalli Ammavari Festival Sirimanotsavam Begins Grandly with Devotee Rush

Update: 2025-10-07 11:44 GMT

Vizianagaram: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది.

అమ్మవారి పూజారి వెంకటరావు సిరిమానును అధిరోహించారు. ఈ సిరిమానును చదరగుడి నుంచి చారిత్రక విజయనగరం కోట వరకు ఊరేగించనున్నారు.

భక్తుల జయజయ ధ్వానాల నడుమ అమ్మవారి సిరిమాను ముందుకు సాగుతోంది. ఈ ఊరేగింపులో ముందుగా పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల మరియు అంజలి రథం వంటి సంప్రదాయ చిహ్నాలు అలంకరించి వెళ్తున్నాయి.

ఈ అద్భుతమైన ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు కూడా ఈ సందర్భంగా సిరిమానును దర్శించుకున్నారు.

Tags:    

Similar News