సచివాలయ పరీక్షలకు 92.77 శాతం హాజరు

ఏపీ వ్యాప్తంగా నిన్న సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు.

Update: 2019-09-02 02:43 GMT

ఏపీ వ్యాప్తంగా నిన్న సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. ఉదయం పరీక్షకు 12,53,974 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,62,164 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2,95,980 మంది హాజరు కావాల్సి ఉండగా, 2,72,420 మంది హాజరయ్యారు. మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. మరో ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిరోజు 92.77 శాతం హాజరు నమోదు అయింది. 

Tags:    

Similar News