వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి నారాలోకేష్ పై విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్ ఓ వ్యాధితో బాధపడుతున్నాడని, అదే అతనికి సమస్య అయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు అభిజ్ఞా పక్షపాతంతో(కాగ్నిటివ్ బయాస్) ఉంటారని సైకాలజీ చెబుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దీనిని డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అని పిలుస్తారని.. లోకేశ్కు కూడా ఇదే సమస్య ఉందని చెప్పారు. లోకేశ్ తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం.. ఒక్కడే సంతానం కావడం వల్ల ఆయన ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2019