ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ

Update: 2019-08-08 08:47 GMT

ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. టీడీపీ నేత నన్నపునేని రాజకుమారి ఈ పదవి నుంచి తప్పుకున్న వెంటనే వాసిరెడ్డి పద్మను చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందచేయడంతో ఆయన ఆమోదించారు.

Tags:    

Similar News