బోటు ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష
-కచ్చులూరు బోటు ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష -రిస్కూ ఆపరేషన్స్పై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో రాజమండ్రిలో సమావేశం -సమీక్షలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, పోలీస్ అధికారులు
కచ్చులూరు బోటు ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి వెళ్లిన కిషన్ రెడ్డి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. బోటు వెలికితీత పనులు, రెస్క్యూ ఆపరేషన్పై వివరాలు తెలసుకున్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లి కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఐజీ ఏఎస్ ఖాన్, ఎస్పీ పాల్గొన్నారు.