Madanapalle: నడిరోడ్డుపై బాహాబాహికి దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు

Madanapalle: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్, అటవీశాఖ హెడ్‌ కానిస్టేబుల్‌ బాహాబాహికి దిగారు.

Update: 2021-06-15 05:21 GMT

Madanapalle: నడిరోడ్డుపై బాహాబాహికి దిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు

Madanapalle: చిత్తూరు జిల్లా మదనపల్లిలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్, అటవీశాఖ హెడ్‌ కానిస్టేబుల్‌ బాహాబాహికి దిగారు. కంచె తీయాలని ఒకరు.. తీసేది లేదంటూ వాగ్వాదానికి దిగారు. పట్టణంలో ప్రధాన రహదారి ఏర్పాటు చేస్తూ.. 15 ప్రాంత కూడళ్ల వద్ద రోడ్డుకు అడ్డంగా కంచెలు వేశారు. బెంగుళూరు బస్టాండు నుంచి బ్రిడ్జ్ వద్ద కూడా కంచె ఏర్పాటు చేశారు. అయితే అక్కడికి చేరుకున్న అటవీశాఖ హెడ్‌ కానిస్టేబుల్‌ రామయ్య తనకు అనుమతి ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేశారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వినిపించుకోలేదు. ఐడీ కార్డు తీసి చూపించినా పట్టించుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


Tags:    

Similar News