శ్రీకాళహస్తిలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్

* ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారుల అపహరణ * బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లినట్లు అనుమానం

Update: 2021-01-12 14:15 GMT

Representational image

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నగాచి పాళెంలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్ కు గురయ్యారు. ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల వయస్సున్న ఐశ్వర్య, మీర్చావళి కనిపించకుండా పోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బైక్ పై వచ్చిన వ్యక్తి తీసుకువెళ్లినట్లు కాలనీకి చెందిన వారు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కిడ్నాప్ ఘటనగా పరిగణించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News