YV Subba Reddy: ఇక తిరుమల కొండపై హోటళ్లు ఉండవు... భక్తులకు టీటీడీనే..

YV Subba Reddy: టీటీడీ బోర్డు తిరుమల కొండపై సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2022-02-18 10:28 GMT

YV Subba Reddy: ఇక తిరుమల కొండపై హోటళ్లు ఉండవు... భక్తులకు టీటీడీనే..

YV Subba Reddy: టీటీడీ బోర్డు తిరుమల కొండపై సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా అన్న ప్రసాదం విరివిగా అందజేయాలని వార్షిక బడ్జెట్ ఆమోదం సందర్భంగా నిర్ణయించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు హోటళ్లు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు.

బోర్డు తీర్మానం ప్రకారం రాబోవు రోజుల్లో కొండపైన ఆహార విక్రయ కేంద్రాలను పూర్తిగా తొలగించి, భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తారు. ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన ప్రణాళికను త్వరలోనే సిద్ధం చేస్తామన్నారు. అయితే ఈ నిర్ణయంతో స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తమవుతోంది. 

Tags:    

Similar News