TTD: టీటీడీ పాలకమండలి ఖరారు..!!

* టీటీడీ పాలక మండలిలో 25 మంది సభ్యులు * ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 50 మంది

Update: 2021-09-15 06:30 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (ఫోటో-ది హన్స్ ఇండియా)

TTD: టీటీడీ పాలక మండలి దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. పాతవారిలో ఇద్దరు, ముగ్గురికి తప్ప మిగతావాళ్లకు అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇక ఇవాళ సాయంత్రం, లేదా రేపు ఉత్తర్వులు విడుదల కానున్నాయి. తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక ఇద్దరు, తమిళనాడు నుంచి ఇద్దరికి చొప్పున చోటు కల్పించినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలిలో 25 మంది సభ్యులు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సేవాభావం కలిగిన వ్యక్తులకు అవకాశం కల్పించనున్నారు. విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు పాత్ర ఉంటుందని తెలిపింది ప్రభుత్వం.

Tags:    

Similar News