ఆంధ్రప్రదేశ్ కు అధిక నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన హోంశాఖమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ను కలిశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విభజన హామీలను నెరవేర్చాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం స్వామీ స్వరూపానంద ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చతుర్మాస దీక్షలో పాల్గొన్నారు.