తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ ఏపీ సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో అనిల్కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డి ఆహ్వాన పత్రిక అంద చేశారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుకున్నారు సీఎం జగన్. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.