వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లనున్నారు. కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ ఇవాళ తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లనున్నారు. కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ ఇవాళ తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరిన కేసీఆర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మార్గ మాధ్యం గుండా తమిళనాడు కాంచీపురానికి చేరుకుంటారు. మార్గమధ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రోజా ఇంటికి వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అక్కడే చేయనున్నారు. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు తిరుమల వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.