ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గ్రీన్ కో కంపెనీ కి జగన్ సర్కార్ ఇచ్చిన నోటీసుల పై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఎపి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన ట్రిబ్యునల్.. పీపీఏల్లో ధరలు తగ్గించే అంశంలో గ్రీన్ కో సంస్థలకు అనకూలంగా ఆదేశాలిచ్చింది. యూనిట్ ధర రూ.4.50 నుంచి రూ.2.44 కి తగ్గించాలని గ్రీన్ కో కంపెనీ కి ఇటీవల ఎపి ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ ధరల నిర్ణయం రెగ్యులేటరీ పరిధిలోకి వస్తుందని పేర్కొన్న గ్రీన్కో.. అప్పిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లింది. 2018 నాటి కేసులు పెండింగ్లో ఉన్నందున, తాజా నోటీసుల పై ట్రిబ్యునల్ స్టే విధించింది. తదుపరి విచారణను ఆగస్టు 28 కి వాయిదా వేసింది.