Tourist Places Re-Open: రేపటి నుంచి ఏపీలోని పర్యాటక ప్రాంతాలు రీఓపెన్

AP Tourist Places Re-Open: పర్యాటకశాఖ అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష

Update: 2021-06-23 12:45 GMT

అవంతి శ్రీనివాస్ (ఫైల్ ఇమేజ్)

AP Tourist Places Re-Open: ఏపీలోని పర్యాటక ప్రాంతాలను రేపటి నుంచి రీఓపెన్‌ చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆదేశించారు. సచివాలయంలో మంత్రి పర్యాటకశాఖ అధికారులతో సమీక్షించారు. టూరిజంలో అవినీతికి అడ్డుకట్ట వేయాలని మంత్రి అన్నారు. రేపు బోటు ఆపరేటర్లతో సమావేశం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటిచెప్పేలా దేశoలోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. విశాఖపట్నం ఋషి కొండలోని పర్యాటకశాఖ బ్లూబే హోటల్‌ను 164 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు మంత్రి అవంతి శ్రీనివాస్.

Full View


Tags:    

Similar News