విజయవాడలో ఘనంగా పర్యాటక దినోత్సవ వేడకలు

Update: 2019-09-29 16:19 GMT

పర్యాటక రంగానికి రాష్ర్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు రాష్ర్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి పాల్లొన్నారు. కళాకారులతో కలిసి మంత్రి అవంతి శ్రీనివాస్ స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ కు ఎంపికైన వారికి మంత్రి అవంతి శ్రీనివాస్ మెమెంటో అంద చేసి సన్మానించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Full View

Tags:    

Similar News