నేడు రెండోరోజు నామినేషన్ల స్వీకరణ
* ఎస్ఈసీ నిర్ణయాలతో వాడివేడిగా ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ * ఐఎఫ్ఎస్ అధికారులను ఎలక్టోరల్ అధికారులుగా నియమించనున్న ఎస్ఈసీ
Representational Image
ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయాలతో ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వాడి వేడిగా సాగుతోంది. ఇవాళ రెండోరోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. మరోవైపు రాయలసీమలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సీఎం జగన్ సొంతగడ్డ అయిన కడప జిల్లాలో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ అధికారులను ఎలక్టోరల్ అధికారులుగా ఆయన నియమించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు వారితో సమావేశం కానున్నారు నిమ్మగడ్డ.