ఈరోజు జనసేన, బీజేపీ కీలక సమావేశం

* పంచాయతీ ఎన్నికలపై చర్చ * విజయవాడ బీజేపీ కార్యాలయంలో భేటీ

Update: 2021-01-27 03:34 GMT

Representational Image

పంచాయతీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ కలిసే పోటీకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల నేతలు నేడు సమావేశం కానున్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచాయతీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఎక్కడెక్కడ నామినేషన్లు ఎవరు వేయాలన్నది ఈ సమావేశంలో స్పష్టత రానుంది. దీంతో పాటు తిరుపతి ఉపఎన్నిక అభ్యర్థిపై కూడా చర్చించే అవకాశముంది.

Full View


Tags:    

Similar News