Coronavirus: ఏపీలో మరో మూడు పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. తెలంగాణలో 65 కి కరోనా కేసులు చేరాయి.

Update: 2020-03-28 14:15 GMT
Representational Image

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంది. తెలంగాణలో 65 కి కరోనా కేసులు చేరాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు మరో మూడు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు కరోనా కేసులు నమోదయ్యాయి. చీరాల చెందిన ఒక వ్యక్తి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా కరొనా సోకినట్లు తేలింది. వారిద్దరికీ ఒంగోలులోని రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కర్నూల్ లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది.

తెలంగాణలో కరోనాతో తొలి మరణం నమోదైంది. ఖైరతాబాద్‌లో కరోనాతో వృద్ధుడు(74) మృతి చెందాడు.ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా  వైరస్ కాసుల  సంఖ్య 65కు చేరుకుంది. వీటిలో విశాఖలో నాలుగు కేసులు నమోదు కాగా.. కృష్ణాజిల్లాలో మూడు ,గుంటూరులో 2, ప్రకాశంలో 3, నెల్లూరు 1,తిరుపతి లో 1, రాజమండ్రిలో 1, కర్నూల్ లో ఒకటి నమోదయ్యాయి.


Tags:    

Similar News