Andhra Pradesh: చిన్నపిల్లల కరోనా చికిత్సకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh: పిల్లల కోసం 3 కేర్ సెంటర్లు ఏర్పాటు * అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల నిర్మాణం

Update: 2021-06-07 11:47 GMT
సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో మూడు పిడియాట్రిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పిల్లల కోసం మూడు కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అత్యుత్తమ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల నిర్మాణం చేపట్టనున్నారు. కృష్ణా, గుంటూరు ప్రాంతంలో పీడియాట్రిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక్కో కేర్ సెంటర్‌కి 180 కోట్లు కేటాయించాలని.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్ సమీక్ష నిర్వహించారు.

Full View


Tags:    

Similar News