రఘువీరారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీపీసీసీ) పదవికి త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయి. పీసీసీ ఎంపిక కోసం ఊమెన్ చాందీ నేతృత్వంలో అంతర్గత కమిటీ ఏర్పాటైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ రేసులో మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ కేంద్ర మంత్రులు.. చింతా మోహన్, పళ్లంరాజు అలాగే గిడుగు రుద్రమ రాజు ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యవహారాల ఢిల్లీ ఇన్చార్జి ఊమెన్ చాందీ పార్టీ పరిస్థితులపై శనివారం సోనియాగాంధీకి నివేదిక సమర్పించనున్నారు. అలాగే పీసీసీని ఎంపిక చేసే అంశాన్ని పూర్తిగా అధినేత్రికి అప్పగించనున్నారు.
Keywords : APPCC, Pallamraju, Sailajanath, Chinta Mohan, Rudraraju, Sonia Gandhi, Delhi