విజయవాడను కరోనా భయం వీడింది. మూడు రోజుల క్రితం కరోనా అనుమానంతో ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. విజయవాడకు చెందిన వ్యక్తి ఇటీవల హైదరాబాద్లో ఉద్యోగరీత్యా స్థిరపడి ఉద్యోగ రీత్యా జర్మనీకి వెళ్లాడు. అక్కడే 17రోజులు బస చేసిన ఆయన అక్కడ్నుంచి బెంగుళూరు-హైదరాబాద్ విమానంలో ప్రయాణం చేశాడు. తీవ్ర జలుబుతో భాదపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. దీంతో ఆయనకు టెస్ట్లు చేసి పూణేకు పంపగా కరోనా నెగటివ్ అని తేలింది. దీంతో డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ అతడిని డిశ్చార్జ్ చేయనున్నట్టు డాక్టర్లు తెలిపారు.