Vijayawada: జనసేన, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

Vijayawada: జనసేన నేతలను అడ్డుకునేందుకు వైసీపీ నేత ప్రయత్నం

Update: 2023-10-04 08:41 GMT

Vijayawada: జనసేన, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం

Vijayawada: విజయవాడలోని పెడనలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. తాము కట్టిన ఫ్లెక్సీల ముందు వేరే ఫ్లెక్సీలు కట్టొద్దంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. తమ నాయకుడి కార్యక్రమం ఉండడంతో ఫ్లెక్సీ కట్టేందుకు జనసేన నేతలు రెడీ అయ్యారు. దీంతో జనసేన నేతలను స్థానిక వైసీపీ నేత అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఫ్లెక్సీలు కట్టుకునేందుకు తమకు అనుమతి ఉందని వాగ్వాదానికి దిగారు. దీంతో రంగం ప్రవేశం చేసిన పోలీసులు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

Tags:    

Similar News