Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఉద్రిక్తత

Andhra Pradesh: వీరన్నబాబు సంబరం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు

Update: 2021-03-04 07:15 GMT

Representational Image

Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో స్థానికులు ఆందోళనకు దిగారు. వీరన్నబాబు సంబర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఘటనకు నిరసనగా రోడ్డుపై వాహనాలను అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, హిందూ భక్తులు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి హిందూ సాంప్రదాయాలను కాపాడాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News