AP News: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత

AP News: ఈ రోజు 26, రేపు 69 మండలాల్లో వడగాల్పులు

Update: 2023-04-11 12:50 GMT

AP News: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత

AP News: ఏపీలో రోజు రోజుకు ఎండల తీవ్ర పెరుగుతోంది. ఇవాళ 26, రేపు 69 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి ఏలూరు, కాకినాడ, మన్యం, ఎన్టీఆర్, విజయనగరం, కడప జిల్లాల్లోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు, వడగాల్పులు వీయనున్నాయి.. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని... ఒక వేళ బయటకు వెళ్తే ఎండ, వడగాల్పుల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News